సుబేదారి, జూలై 2 : కమిషనరేట్ పరిధిలో తొమ్మిది మంది ఇన్స్పెక్టర్లు, ఐదుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ మంగళవారం పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ఝా ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనరేట్ పీసీఆర్లో పనిచేస్తున్న ఆర్ సంతోష్ ఆత్మకూర్ సీఐగా బదిలీ కాగా, ఇక్కడ పనిచేస్తున్న వీ క్రాంతికుమార్ పరకాలకు బదిలీ అయ్యారు. పరకాలలో పనిచేస్తున్న డీ రవిరాజు వరంగల్ వీఆర్కు బదిలీ అయ్యారు. వీఆర్లో ఉన్న జీ బాబులాల్ గీసుగొండకు, అక్కడ పనిచేస్తున్న ఎల్ లవన్కుమార్ టాస్క్ఫోర్స్కు బదిలీ అయ్యారు.
వీఆర్ భరోసా సెంటర్కు అటాచ్డ్గా ఉన్న ఏ సువర్ణ సుబేదారి మహిళా పీఎస్కు బదిలీ కాగా, ఇక్కడ పనిచేస్తున్న ఎన్ కరుణాకర్ సీసీఆర్బీకి బదిలీ అయ్యారు. వీఆర్లో ఉన్న కే రామకృష్ణ వరంగల్ ట్రాఫిక్కు బదిలీ కాగా ఇక్కడే పనిచేస్తున్న కే శ్రీధర్ టాస్క్ఫోర్స్కు బదిలీ అయ్యారు. అలాగే, ఎస్సైలు గీసుగొండలో పనిచేస్తున్న ఎస్ వెంకన్న, ఆత్మకూర్ ఎస్సై జీ రాజేశ్రెడ్డి, హనుమకొండ ఎస్సై పీ శ్రీనివాస్, ఐనవోలు ఎస్సై జీ అనిల్కుమార్ వీఆర్కు బదిలీ కాగా, దేవరుప్పులలో పనిచేస్తున్న ఎన్ చెన్నకేశవులు జనగామకు బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.