హనుమకొండ చౌరస్తా, జూలై 1 : నిరుద్యోగులు రోడ్డెక్కారు. డీఎస్సీ వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం హనుమకొండలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం ఎదుట అభ్యర్థులు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకం గా నినాదాలు చేశారు. డీఎస్సీ పోస్టులు 25వేలకు పెంచాలని, పదోన్నతుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డీఎస్సీ అభ్యర్థులు రోడ్డెక్కారు. ఈ నెల 18నుంచి ప్రారంభం కానున్న డీఎస్సీ పరీక్షలను వాయి దా వేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం వెంటనే 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని, 90 రోజుల పాటు పరీక్ష వాయిదా వేయాలన్నారు.