వరంగల్, జూన్ 30 : స్మార్ట్సిటీ మిషన్ పథకాన్ని మరో ఏడాది పాటు కేంద్రం ప్రభుత్వం పొడిగించింది. జూన్ 30తో ఐదేళ్ల స్మార్ట్సిటీ మిషన్ పథకం ముగిసిన నేపథ్యంలో 2025 మార్చి 31 వరకు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ను కలిసి స్మార్ట్సిటీ పనుల్లో చాలా వరకు పూర్తి కాలేదని, ఈ పథకాన్ని ఏడాది పాటు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్లో 47 అభివృద్ధి పనులు మాత్రమే పూర్తయ్యాయని, రూ. 518 కోట్లతో చేపట్టిన మరో 66 పనులు పురోగతిలో ఉన్నాయని కేంద్ర మంత్రికి వివరించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది. కాగా, ఈ పథకంలో కొత్త అభివృద్ధి పనులకు అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో స్మార్ట్సిటీ బోర్డులో ఆమోదం పొందిన పనులను మాత్రమే చేపట్టాలని సూచిందింది.సాధ్యమైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని సూచించింది. కొనసాగుతున్న అభివృద్ధి పనులకు నిధులను సెప్టెంబర్ వరకు విడుదల చేస్తామని తెలిపారు. ఫస్ట్ కం ఫస్ట్ పద్ధతిలో నిధుల విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
హనుమకొండ : స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితిని 2025 మార్చి 31వ తేదీ వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ కడియం కావ్య కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ ప్రజలకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందనున్నాయని పేర్కొన్నారు.