హనుమకొండ, జూన్ 29 : సీఎం రేవంత్రెడ్డి వరంగ ల్, హనుమకొండ జిల్లాల పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డితో పాటు కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కాగా, ప ర్యటనను అడ్డుకుంటామని ప్రకటించనప్పటికీ హౌస్ అరెస్టు చేయడంపై రాకేశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్ర జా పాలనలో పోలీసుల పహారా, నిర్బంధాలు ఎందుకు? ప్రజా ప్రభుత్వమంటూ బీరాలు పలుకుతూ ప్రతిపక్ష నా యకులపై ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు. ఆరు నెలల పాలనకే ఇంత అభద్రతా భావమా? అన్నారు. సీఎం సహా సగం క్యాబినెట్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రైవేట్ దవాఖాన ప్రారంభించేందుకు ఎగేసుకొని వస్తున్నప్పటికీ వరంగల్కు సీఎం వస్తున్నారనే వాతావరణం, కలేలేదని విమర్శించారు.
ప్రెస్మీ ట్ తర్వాతే సీఎం పర్యటనలో మార్పులు వచ్చాయన్నా రు. మాజీ సీఎం కేసీఆర్ నిర్మించ తలపెట్టిన 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు ఎందుకు జరగడం లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎంజీ ఎం హాస్పిటల్కు సందర్శించకుండా కార్పొరేట్ ఆస్పత్రి ప్రారంభానికి రావడం ఏమిటని ప్రశ్నించారు. కాకతీయ కళాతోరణాన్ని అధికారిక చిహ్నం నుంచి తొలగించడంపై సీఎం స్పష్టత ఇవ్వాలన్నారు. కాకతీయ కళా తోరణం రా చరిక దర్పం అన్న వ్యాఖ్యలను వెనకి తీసుకొని ఓరుగ ల్లు ప్రజలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేకపో తే ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులంతా రేవంత్రెడ్డి ఇంటిముందు ధర్నా చేయాలని డి మాండ్ చేశారు. కడుపు మీద కొట్టినా ఓర్చుకుంటామని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకొనే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లైబ్రరీలో నిర్బంధించడం అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నదని పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఓట్లు వేస్తే గద్దెనెకి ఇప్పుడు వాళ్లనే తాళం వేసి బంధించడం కాంగ్రెస్ అవకాశవాదానికి అద్దం పడుతున్నదన్నారు. అందరినీ నిర్బంధించి పర్యటించడమేనా ప్రజా పాలన అని ప్రశ్నించారు. అంత భయం ఉన్నప్పుడు పర్యటనలు ఎందుకని, వర్చువల్గా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని ఎ ద్దేవా చేశారు. అరెస్టయిన వారిలో 2వ డివిజన్ కా ర్పొరేటర్ రవినాయ క్, బీఆర్ఎస్ నాయకులు మండల సురే శ్, దేవయ్య, కేయూ నేత కొమురన్న, యాదగిరి, లక్ష్మణ్, అశోక్, గువ్వ రాజేశ్, పిన్నింటి విజయ్, ప్ర శాంత్, శ్రీకాంత్, కా ర్తీక్, చందర్, కరుణాకర్, అనిల్, రవీందర్రెడ్డి, కుమార్, నాగరా జ్, విజయ్, నిశాంత్, అన్నమాచారి ఉన్నారు.
విద్యార్థి నాయకుల అరెస్టు..
నయీంనగర్/సుబేదారి : జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో విద్యార్థి నాయకులను కేయూసీ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టయిన వారి లో పబ్జోజు శ్రీకాంత్చారి, శరత్చంద్ర, ప్రశాంత్, సూర్యకిరణ్, మనోజ్, రంజిత్, రాజేందర్, రాకేశ్, శ్రావణ్, నరేందర్, వీరస్వామి, స్నేహిత్, కల్యాణ్ ఉన్నారు. సుబేదారి పోలీసు స్టేషన్కు ఎనిమిది మందిని, హనుమకొండ స్టేషన్కు ఇద్దరు, కేయూ పోలీసు స్టేషన్కు ఐదుగురి బీఆర్ఎస్ నాయకులను తరలించారు. సాయంత్రం ములుగు రోడ్డులో టాస్క్ఫోర్స్ సిబ్బంది మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
రేవంత్రెడ్డికి నిరసన సెగ..
వరంగల్ : వరంగల్ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్రెడ్డికి నిరుద్యోగుల నుంచి నిరసన సెగ తగిలింది. శనివారం నగరంలో 24 అంతస్తులతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సందర్శనకు వచ్చిన సమయంలో ఎదురుగా ఉన్న సెంట్రల్ లైబ్రరీలో గ్రూప్స్కు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులు కా న్వాయ్లో వస్తున్న సీఎంకు కనిపించేలా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. గ్రూప్-2, గ్రూప్-3 పో స్టులను పెంచి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించాలని, గ్రూప్-1 మెయిన్స్కు 1:100 అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్లకార్డుల ను ప్రదర్శించారు. డీఎస్సీ 3 నెలలు వాయిదా వేసి 25 వే ల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలని నిరుద్యోగులు నినాదాలు చేశారు. అయితే నిరుద్యోగులు రోడ్డుపైకి రాకుండా పోలీసులు లైబ్రరీ గేట్కు తాళం వేశారు.