వరంగల్, జూన్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన టెక్స్టైల్ పార్కు, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అలాగే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అభివృద్ధి పనులపై రెండు జిల్లాల ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన మహిళా శక్తి క్యాంటీన్ను సీఎం రేవంత్రెడ్డి హనుమకొండ కలెక్టరేట్లో ప్రారంభించనున్నారు. వరంగల్, హనుమకొండ బస్స్టేషన్ల కొత్త భవనాల నిర్మాణాలకు నిధుల కోసం ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మామునూరు ఎయిర్పోర్టు అభివృద్ధిపైనా చర్చించనున్నట్లు తెలిసింది.
సీఎం పర్యటన ఇలా..