మహబూబాబాద్, జూలై 3(నమస్తే తెలంగాణ) : ‘బీఆర్ఎస్కు మళ్లీ మంచిరోజులొస్తాయ్.. మరికొద్ది రోజుల్లో టార్చ్లైట్ పట్టుకొని జనం వెతుక్కుంటూ బీఆర్ఎస్ను వెతుక్కుంటూ వస్తారని ఆశాభావం వ్యక్తంచేస్తున్నా. అప్పటిదాకా ఓపికతో ప్రజాసమస్యలపై పోరాటం చేస్తూ వారికి అందుబాటులో ఉండండి’ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బుధవారం ఎర్రవెల్లిలో తనను కలిసేందుకు వచ్చిన మానుకోట నేతలతో ఆయన సమావేశమయ్యారు. కలిసిన వారిలో ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, సిరికొండ మధుసూదనాచారి, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, ఉద్యమకారుడు రవికుమార్, రాష్ట్ర నాయకులు బీరెల్లి భరత్కుమార్రెడ్డితో పాటు అసెంబ్లీ నియోజకవర్గంలోని 60మంది నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.