హనుమకొండ జిల్లాకేంద్రంలోని ప్రధాన రహదారుల్లో ప్రమాదకరంగా ఉన్న గుంతలు వాహనదారులకు పరీక్ష పెడుతున్నాయి. చాలాకాలంగా వాటిని పూడ్చకపోవడంతో మరింత లోతుగా మారి చుక్కలు చూపెడుతున్నాయి. ముఖ్యంగా బస్స్టేషన్ లోపల, అధ్వానంగా వాన నీరు నిలిచి బురదమయం అవుతున్నాయి. ఉదయమే ఇలా ఉంటే రాత్రిపూట అటు ప్రయాణికులతో పాటు బస్సు డ్రైవర్లూ ఇబ్బంది పడుతున్నారు. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే బస్స్టేషన్ దుస్థితిని మార్చాలని ప్రజలు కోరుతున్నారు.