ములుగురూరల్, జూన్ 29 : ములుగు జిల్లా తొలి జడ్పీ చైర్మన్, దివంగత కుసుమ జగదీశ్వర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా శనివారం నేతలు ఘన నివాళి అర్పించారు. మంత్రి సీతక్క, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, శంకర్నాయక్, తాటికొండ రాజయ్య, రాష్ట్ర నేతలు గ్యాదరి బాలమల్లు, కర్నె ప్రభాకర్, ములుగు, హనుమకొండ, భూపాలపల్లి జిల్లాల జడ్పీ అధ్యక్షులు బడే నాగజ్యోతి, సుధీర్కుమార్, గండ్ర జ్యోతి, వరంగల్ జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు, మాజీ ఎంపీ సీతారాంనాయక్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పోరిక గోవింద్నాయక్ వేరు వేరుగా మల్లంపల్లికి చేరుకున్నారు. ప్రథమ వర్థంతి సభ వేదికపైకి చేరుకొని జగదీశ్వర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమం, బీఆర్ఎస్కు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ములుగు జిల్లా తొలి జడ్పీ చైర్మన్గా ప్రజల సంక్షేమం కోసం పాటు పడిన నేత జగదీశ్వర్ అన్నారు. ఆయనకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత స్థానం కల్పించి జడ్పీ చైర్మన్ ఎంపిక చేశారని తెలిపారు. అనతికాలంలోనే ఆయన అకాల మరణం ములుగు ప్రజలతో పాటు బీఆర్ఎస్కు తీరని లోటన్నారు. జగదీశ్వర్ కుటుంబానికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మంగపేట మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోరిక విజయ్రామ్నాయక్, మల్లంపల్లి ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్, సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, వాత్సవాయి శ్రీధర్వర్మ, రాజుయాదవ్, సమ్మయ్య, ముకుందం, నరేందర్, జిల్లా యూత్ అధ్యక్షుడు కోగిల మహేశ్, తిరుపతి, శ్రీనివాస్, గుడివాడ శ్రీహరి, బైకాని సాగర్, దుర్గం రమణయ్య, కాంగ్రెస్ నాయకుడు బాదం ప్రవీణ్, నాయకులు మర్రి యాదవరెడ్డి, రఘు, శ్రీనివాస్, రమణ, సూర్యకిరణ్, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకులు వినయ్, ప్రశాంత్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.