రైతులకు భరోసా కల్పించేందుకు నిర్వహించే కార్యక్రమంలో వారే లేకపోవడంతో తూతూమంత్రంగా ముగించారు. మండలంలోని చీటకోడూర్ రైతు వేదికలో సోమవారం అధికారులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అసలే వానకాలం. వ్యవసాయ పనుల్లో బిజీబిజీ. వర్షాలు కురవకపోవడం, ఉన్న బోరుబావుల నీటితో రైతులు పొలం పనులు చేసుకుంటున్న క్రమంలో ప్రభుత్వం రైతు భరోసా పథకంలో భాగంగా వారి సూచనలు, సలహాలు తీసుకోవడానికి సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కొద్ది మంది రైతులే హాజరవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.