వరంగల్, మే 2 : స్మార్ట్సిటీ పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగించారు. 2024 జూన్ 30 వరకు నగరంలో స్మార్ట్సిటీ పథకం ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జూన్తో వరంగల్ స్మార్ట్సిటీ పథకం గడువు ముగియనున్న నేపథ్యంలో కేంద్రం మరో ఏడాది పాటు పొడిగించింది. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో స్మార్ట్సిటీ ద్వారా చేపట్టినన పనుల్లో పురోగతిలో ఉన్న వాటిని ఏడాదిలో పూర్తి చేయాలని పేర్కొంది. ఫైనాన్షియల్ క్లియరెన్స్ అయిన పనులను జూన్ 2024 నాటికి పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కాగా, అదనపు అంచనాలు, కొత్త పనులను చేపట్టకూడదన్న నిబంధనతో స్మార్ట్సిటీ పథకాన్ని ఏడాది పాటు పొడిగించింది.
వేగంగా పనులు పూర్తి చేయాలి : బోయినపల్లి వినోద్కుమార్
మరో ఏడాది పాటు స్మార్ట్సిటీ పథకాన్ని పొడిగించిన నేపథ్యంలో పురోగతిలో ఉన్న పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అధికారులకు సూచించారు. ఈ మేరకు ఆయన మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్యకు లేఖ రాశారు. కొత్త పనులు, కొత్త ప్రతిపాదనలు ఏమి చేయకుండా ప్రస్తుతం పురోగతిలో ఉన్న స్మార్ట్సిటీ పనులను 2024 జూన్ 30 వరకు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.