చెన్నారావుపేట/నెక్కొండ, జూలై 2: వానకాలం పంటల సాగుకు రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని వెంటనే అందజేయాలని రైతులు కోరారు. చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ పీఏసీఎస్, నెక్కొండ సొసైటీలో రైతు భరోసాపై మంగళవారం అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీసీవో సంజీవరెడ్డి హాజరై రైతుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. నెక్కొండలో సొసైటీ చైర్మన్ మారం రాము మాట్లాడుతూ నెక్కొండ సొసైటీలో 1499 మంది రైతులకు సంబంధించి రూ. 9.25 కోట్ల రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. అత్యవసర సమావేశానికి 118 మంది రైతులు హాజరయ్యారు. వారిలో ఐదెకరాలలోపు రైతు భరోసా అందించాలని 80 మంది, పదెకరాలలోపు అందించాలని 14 మంది, సాగు చేసిన విస్తీర్ణానికి అందించాలని 15 మంది, మూడెకరాలలోపు అందించాలని ఏడుగురు, రెండెకరాలలోపు అందించాలని ఇద్దరు రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు సీఈవో మోడెం సురేశ్ తెలిపారు. చెన్నారావుపేటలో జరిగిన సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ మురహరి రవి, మాజీ సర్పంచ్ సిద్దన రమేశ్, ఎంపీటీసీ కడారి సునీతా సాయిలు, వైస్ చైర్మన్ పెండ్లి మల్లయ్య, డైరెక్టర్ మొగిలి వెంకట్రెడ్డి, నోడల్ ఆధికారి కిరూనాయక్, ఏవో శశికాంత్, ఏఈవో సంపత్, వీరారెడ్డి, అనుముల రవి, సొసైటీ సీఈవో పులి రమేశ్ పాల్గొన్నారు. అలాగే, నెక్కొండలో మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీశ్రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, వైస్ చైర్మన్ మెండె వెంకన్న, ఏవో నాగరాజు, సొసైటీ డైరెక్టర్లు తాటిపర్తి నాగేంద్రమ్మ, పొరండ్ల రాంచందర్, జంగిలి లక్ష్మి, సింగారపు కమలమ్మ,కొయ్యడ వెంకన్న, తేజావత్ గోపి, రెడ్డబోయిన కుమారస్వామి, సౌరపు శ్రీను, లావుడ్యా యాకూబ్, రైతు ప్రతినిధులు చల్లా చెన్నకేశవరెడ్డి, తాటిపెల్లి శివకుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.
ఖానాపురం/నర్సంపేట రూరల్: మండలకేంద్రంలోని రైతు వేదికలో రైతుభరోసా పథకంపై రైతుల నుంచి అభిప్రాయ సేకరణ కోసం ఖానాపురం సహకార సం ఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, ఇన్చార్జి ఏడీఏ నగేశ్ ఆధ్వర్యంలో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. రై తులు ఉపేందర్రెడ్డి, అశోక్ మాట్లాడుతూ పంటలు సాగు చేసే ప్రతి రైతుకూ పెట్టుబడి సాయం అందించాలని కోరారు. రైతులు మురళి, ప్రసాదరావు మాట్లాడు తూ ఐదు నుంచి పదెకరాలలోపు పంట భూములకు రైతు భరోసా ఇవ్వాలన్నారు. రైతు మల్లారెడ్డి మాట్లాడుతూ రైతు భరోసాను తొలగించి పంటలకు మద్దతు ధర ఇస్తే బాగుంటుందన్నారు. 18 మంది ఐదెకరాలలోపు, 13 మంది పదెకరాలు, నలుగురు పంట సాగు చేసిన వారికే ఇవ్వాలని అభిప్రాయం తెలిపారు. నర్సంపేట పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయ ఆవరణలో ఏడీఏ కీసరి నగేశ్ రైతు భరోసాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు రైతులు పదెకరాల వరకు, మరికొందరు కౌలు రైతులకు సైతం రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖానాపురం సమావేశంలో కో ఆపరేటివ్ సీనియర్ ఇన్స్పెక్టర్ విమల, ఏవో శ్రీనివాస్, ఏఈఓలు సంతోష్, నాగరాణి, సంధ్యతో పాటు సొసైటీ డైరెక్టర్లు, రైతులు, నర్సంపేటలో పీఏసీఎస్ చైర్మన్ బొబ్బాల రమణారెడ్డి, వైస్ చైర్మన్ మేరుగు శ్రీనివాస్, ఏవో కృష్ణకుమార్, విమల, ఏఈవో మెండు అశోక్, సొసైటీ పాలకవర్గ సభ్యులు దామెర రవిందర్, మొరాల మోహన్రెడ్డి, కోమాండ్ల రాజిరెడ్డి, బానోతు లక్ష్మణ్, పెసరు సాంబరాజ్యం, దరుగురి తిరుపతి, మిట్టగడపల సుప్రజ, బైరి జనార్దన్రెడ్డి, గుజ్జుల మాధవరెడ్డి, పాలాయి రాము, దొంగల వెంకటమ్మ, సీఈవో తడక రాజు, సిబ్బంది మధు, కిరణ్, బొంద్యాలు, సతీశ్, యామిని పాల్గొన్నారు.