హనుమకొండ, జూన్ 29 : వరంగల్పై ఇక తాను స్పెషల్ ఫోకస్ పెడతానని.. హైదరాబాద్తో పోటీపడేలా నగరాన్ని అభివృద్ధి చేయడంతో పాటు హెల్త్, ఎకో టూరిజం సిటీగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి తెలిపారు. ఇందుకోసం రూ.6,115 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేసినట్లు పేర్కొన్నారు. అధికారులు సైతం వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ నగర అభివృద్ధిపై హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సీఎం ఎనిమిది అంశాలపై సుమారు మూడు గంటల పాటు సుదీర్ఘంగా సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా రింగ్ రోడ్డు, నిర్మాణం స్మార్ట్పనులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, విమానాశ్రయం పరిస్థితి, కాళోజీ కళాక్షేత్రం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.
మొదట రింగ్ రోడ్డు నిర్మాణంపై హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రెండు దశల్లో 13 కిలోమీటర్ల వరకు చేపట్టనున్న రింగ్రోడ్డు నిర్మాణానికి సత్వరమే భూసేకరణ చేపట్టి ఆ తర్వాతే నిర్మాణ పనులను చేపట్టాలని ఆదేశించారు. వరంగల్ నుంచి ఇతర జిల్లాలకు రవాణా సౌకర్యం మెరుగుపడేలా జాతీయ రహదారుల కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి టెక్స్టైల్ పారుకు రోడ్డు కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవలన్నారు. కాళోజి కళాక్షేత్రం పనులు సెప్టెంబర్ 9లోగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వరంగల్ నగరంలో కాలనీలు ముంపునకు గురవుతున్నాయని ఇందుకుగాను శాశ్వతంగా పరిషారం చూడాలని అధికారులను ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలని, నాలాల ఆక్రమణపై దృష్టి పెట్టాలని పేరొన్నారు. నాలాల్లో సిల్టును ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. హైదరాబాద్లో చేపడుతున్న కొత్త పద్ధతులను వరంగల్ నగరంలో ప్రయోగించాలన్నారు. నాలాలపై అక్రమ నిర్మాణాలు ఉంటే వెంటనే తొలగించాలని ఆదేశించారు.
యూజీడీ కోసం డీపీఆర్ రూపొందించండి
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంపై డీపీఆర్ తయారు చేయాలని సీఎం ఆదేశించారు. వర్షం కురిచినప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనుల అంచనాల వ్యయం ఎందుకు పెరిగిందని అధికారులను ప్రశ్నించారు. ఎలాంటి అప్రూవల్ లేకుండా రూ.1100 కోట్ల నుంచి రూ.1726 కోట్లకు ఎలా పెరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈపీసీ పద్ధతిన పనులు చేపడుతున్నందున అలా పెంచే వీలు లేదని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని మండిపడ్డారు. పనుల విలువ అంచనాల పెంపుపై ప్రత్యేక రిపోర్టు తయారుచేయాలని సీఎం ఆదేశించారు. నగర అభివృద్ధిపై ప్రతి 20 రోజులకోసారి సమీక్షించాలని ఆదేశించారు. 2050 సంవత్సరానికి అనుగుణంగా వరంగల్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయాలని సూచించారు. హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రి మాదిరిగా వరంగల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మమునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ తక్షణమే చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేవించారు. ఇందుకు అవసరమైన నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందో తెలుసుకోవాలని పేరొన్నారు.
‘ఎమర్జెన్సీ’ వైద్యుల, సిబ్బందికి పారితోషికం
అత్యవసర సమయంలో ఆపరేషన్లు, ఇతర వైద్య సేవలు నిమ్స్లో అందిస్తున్నట్లుగా ఎంజీఎం ఆస్పత్రిలో ఎన్ఓసి ఇచ్చే అంశంపై పరిశీలన చేస్తామని సీఎం వెల్లడించారు. ఎమర్జెన్సీ సమయంలో సర్జరీలు, వైద్య సేవలు అందిస్తున్న డాక్టరు,్ల సిబ్బందికి తగిన పారితోషికం అందిస్తామని సీఎం ప్రకటించారు. స్వశక్తి మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సూల్ విద్యార్థుల యూనిఫాం పెండింగ్ బిల్స్ వెంటనే చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. రానున్న రోజుల్లో అన్ని ప్రభుత్వ శాఖల యూనిఫామ్లు కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించే అవకాశం ఉందని ఈ విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. ఇందిరా మహాశక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. త్వరలో వరంగల్ అభివృద్ధిపై జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సమగ్రంగా సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం స్వశక్తి మహిళలకురూ. 518 కోట్ల 71 లక్షల 20వేల చెకును సీఎం అందజేశారు.
మాస్టర్ ప్లాన్ సరిగా లేదు
కుడా మాస్టర్ప్లాన్ సరిగా లేదని, మళ్లీ కొత్త మాస్టర్ ప్లాన్ను రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి కొండా సురేఖ, సీఎం దృష్టికి తీసుకెళ్లారు. నగర అభివృద్ధికి నిరంతర కృషి చేసేందుకు స్పెషల్ ఆఫీసర్ను నియమించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీఎంను కోరారు. నగరంలో కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురయ్యాయని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వరంగల్ అభివృద్దికి సీఎం చేసిన సూచనలు పాటిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుఆమర్ తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, ఎంపీలు కడియం కావ్య, పోరిక బలరాం నాయక్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, మామిడాల యశస్విని, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ దాన కిషోర్, రాష్ట్ర టూరిజం, కల్చర్ యూత్ అడ్వాన్స్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణీప్రసాద్, కుటుంబ సంక్షేమ శాఖ సెక్రెటరీ క్రిస్టియానో జెడ్ చోంగ్తో, ఇంధన శాఖ సెక్రటరీ రొనాల్డ్ రోస్, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు పి.ప్రావీణ్య, సత్యశారదాదేవి, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, రోడ్ల భవనాల శాఖ స్పెషల్ సెక్రటరీ హరిచందన, సెర్ప్ సీఈవో దివ్య, హౌసింగ్ శాఖ స్పెషల్ సెక్రటరీ వీపీ గౌతమ్, ఆర్ అండ్ బీ శాఖ జాయింట్ సెక్రటరీ హరీశ్, ఐ అండ్ పీఆర్, దేవాదాయ శాఖ కమిషనర్ హన్మంతరావు, ఎన్పీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్రెడ్డి పాల్గొన్నారు.
త్వరలో సమావేశం నిర్వహిస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
వరంగల్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీనివాస్ రెడ్డి పేరొన్నారు. త్వరలో ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి వరంగల్ సమగ్ర అభివృద్ధిపై సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. రింగ్ రోడ్డు భూసేకరణ అంశం వేగవంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని పేరొన్నారు. అలాగే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ వ్యయ అంచనాల పెంపుపై సమగ్రంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.