వరంగల్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం వ రంగల్ జిల్లాలో పర్యటించారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయ న తొలిసారి జిల్లాకు వచ్చారు. హైదరాబాద్ నుంచి నేరుగా హె లికాప్టర్ ద్వారా గీసుగొండ మం డలంలోని శాయంపేట వద్ద గల కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు కు చేరుకున్నారు. టెక్స్టైల్ పా ర్కులో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి కా కతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పొగడ మొక్క నాటడం ద్వారా ఈ ఏడాది రాష్ట్రస్థాయి వజ్రోత్సవ వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. పచ్చదనం పెంపు లక్ష్యంగా ఈ ఏడాది రాష్ట్రంలో 20.20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పీసీసీఎఫ్ డోబ్రియల్ వెల్లడించారు.
అనంతరం కిటెక్స్ కంపెనీ వద్ద పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి పరిశీలించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటుతో భూములు కోల్పోయిన రైతులకు స్థలాల కేటాయింపు విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి బాధిత రైతులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అధికారులకు చెప్పా రు. అనంతరం ఆయన 24 అంతస్తులతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సందర్శించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్ప త్రి నిర్మాణ పనుల పురోగతిపై గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన మ్యాప్ ద్వారా పనుల వివరాలను తెలుసుకున్నారు. ఇప్పటివరకు జరిగినవి, ఇంకా మిగిలి ఉన్న పనుల వివరాలను ఆర్అండ్బీ, వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు సీఎం రేవంత్రెడ్డికి తెలిపారు. ఈ క్రమంలో ఆస్పత్రి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.