హనుమకొండ, జూలై1: ‘సీఎం సర్.. ప్లీజ్ హెల్ప్ మీ’ అని వేడుకున్న క్యాన్సర్ బారిన పడిన చిన్నారి ఆదిల్కు సీఎం రేవంత్రెడ్డి అభయమి చ్చారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘విన్న పాలు వినలే’ శీర్షికన అతడి విషయం వెలుగులోకి రావడంతో ముఖ్యమంత్రి స్పందించారు. తక్షణ మే వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించడంతోపాటు మరింత సాయం అందిస్తామని అతడి కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ క్యాన్సర్తో బాధ పడుతున్నాడు. శనివారం నగర పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నట్లు తెలుసుకొన్న ఆదిల్ తండ్రి కుమారుడిని తీసుకొని హనుమకొండ కలెక్టరేట్కు వచ్చాడు. ప్లకార్డు పట్టుకొని ముఖ్యమంత్రికి తన పరిస్థితిని వివరిద్దామను కుంటే అక్కడున్న పోలీసులు అడ్డుకున్నారు. సమీక్ష అనం తరం సీఎం వెళ్లిపోయారు. ఈ విషయం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితం కాగా, ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లింది. తక్షణమే ఆదిల్కు వైద్య సహాయం అందించాలని ఆదే శించారు. ఈమేరకు సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్ బాలుడి కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై వేముల శ్రీనివాస్ ఆరా తీశారు. నెల రోజుల క్రితం ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం బసవ తా రకం క్యాన్సర్ ఆస్పత్రికి రూ.లక్ష ఎల్వోసీ మంజూరు చేయ గా సీఎంఆర్ఎఫ్ ద్వారా మరింత సాయం అందిస్తామని ఆదిల్ కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు.