వరంగల్, జనవరి 27 : భారత్ పెట్రోలియం ఉత్పత్తులను అత్యధికంగా విక్రయించినందుకు హనుమకొండ అంబేద్కర్ సెంటర్లోని కాకతీయ ఫిల్లింగ్ స్టేషన్కు చాంపియన్ ఆఫ్ ఇయర్-2023 అవార్డు లభించింది. భారత్ పెట్రోలియం సంస్థ అధ్వర్యంలో నిర్వహించిన స్పూర్తి -2023 డీలర్స్ నైట్లో కాకతీయ ఫిల్లింగ్ స్టేషన్ ఇన్చార్జి, ఏసీపీ సురేందర్ భారత్ పెట్రోలియం సంస్థ టెరిటోరియల్ మేనేజర్ బీ స్వరూప్ చేతుల మీదుగా రోలింగ్ షీల్డ్, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ను శుక్రవారం వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఫిల్లింగ్ స్టేషన్ సిబ్బందిని సీపీ అభినందించారు. కాకతీయ ఫిల్లింగ్ స్టేషన్లో వాహనదారులకు నాణ్యమైన, సరైన తూకంతో పెట్రో ఉత్పత్తులను విక్రయించడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నదన్నారు. అనంతరం ఏసీపీ సురేందర్, హెడ్ కానిస్టేబుల్ రమేశ్, కానిస్టేబుళ్లు ప్రభాకర్రెడ్డి, శ్రీశైలం, దయాకర్తో పాటు ఫిల్లింగ్ స్టేషన్ సిబ్బందని పోలీస్ కమిషనర్ అభినందించారు.