సుబేదారి, జూలై 3 : రాష్ట్ర ప్రభుత్వం సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను బుధవారం విడుదల చేసింది. ఇందులో భాగంగా వరంగల్ జైలు నుంచి 17 మందిని విడుదల చేసినట్లు జైలు సూపరింటెండెంట్ కళాసాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. హత్యా నేరాల్లో జీవిత ఖైదు పడిందని, వీరంతా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారని చెప్పారు. చర్లపల్లి జైల్లో నిర్వహించిన జాబ్ మేళా ద్వారా వీరికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు పేర్కొన్నారు. కాగా, తమ వాళ్ల విడుదల కోసం కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. విడుదలైన వారిని కలుసుకొని సాదరంగా ఇంటికి తీసుకువెళ్లారు.