Viral news : ఈ భూమ్మీద ఉన్న ప్రతి జీవి మనుగడ కోసం పోరాటం చేయక తప్పదు. ఎందుకంటే ప్రతి జీవి తాను బతుకడం కోసం మరో జీవిపై ఆధారపడుతుంది. శాఖాహార జీవులు మొక్కలను, మాంసాహార జీవులు ఇతర జంతువులను ఆహారంగా తీసుకుంటాయి. పాము కప్పను చంపుతుంటే, సింహం జింకను చంపుతుంటే మనకు కప్పపైన, జింకపైన జాలేస్తుంది. కానీ పాము దృష్టిలో, సింహం దృష్టిలో మాత్రం ఆ కప్ప, జింక కేవలం ఆహారం. ఇలా ఆహారం కోసం ఓ కొండచిలువ జింకపై దాడి చేసిన వీడియో వైరల్గా మారింది.
ఆ వీడియోలో.. రోడ్డు పక్కన ఉన్న ఒక జింకను కొండచిలువ చుట్టేసింది. దాంతో జింక కుప్పకూలింది. కొండచిలువ ఉచ్చులో కదలలేని స్థితికి చేరింది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వ్యక్తి చెట్టు మండతో కొండ చిలువను కొట్టాడు. దాంతో ఆకలి పసిలో ఉన్న కొండ చిలువ అతనిపై తిరగబడింది. అయినా అతను మరోసారి మండలను తిరిగేసి మొదలుతో కొట్టడంతో ఆ కొండచిలువ అక్కడి నుంచి పలాయనం చిత్తగించింది. బతుకు జీవుడా అంటూ జింక అక్కడి నుంచి లేచి పరుగు తీసింది.
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొండ చిలువ బారి నుంచి జింకను కాపాడిన వ్యక్తిని ప్రశంసిస్తున్నారు. కిందున్న ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి..
You are driving and you see this, would you intervene or let the circle of life continue? pic.twitter.com/VTYlu18VUA
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 20, 2024