వరంగల్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): భూపరిహారం పంపిణీలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అవినీతి నిరోదక శాఖ (ఏసీబీ) అధికారులు వరంగల్ రెవెన్యూ డివిజన్ అధికారి (ఆర్డీవో) సిడాం దత్తును అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఈ అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు దత్తును వరంగల్ ఆర్డీవో కార్యాలయం నుంచి తీసుకెళ్లడం రెవెన్యూ శాఖలో చర్చనీయాంశమైంది.
సిడాం దత్తు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ముందు బదిలీపై వరంగల్ ఆర్డీవోగా వచ్చారు. గతంలో అసిఫాబాద్ ఆర్డీవోగా పనిచేశారు. ఆ సమయంలో అసిఫాబాద్ పట్టణాన్ని ఆనుకొని ఉన్న జన్కాపూర్ శివారు మీదుగా 363 జాతీయ రహదారి నిర్మాణం జరిగింది. జన్కాపూర్ శివారులో అప్పటికే రెండు సర్వేనంబర్లలోని భూమిలో సుమారు 15 ఎకరాల్లో వెంచర్లు చేశారు. ఆ లేఅవుట్లకు సంబంధించిన 6.12 ఎకరాలను 363 జాతీయ రహదారి నిర్మాణానికి సేకరించినట్టు రెవెన్యూ అధికారులు రికార్డుల్లో పేర్కొన్నారు.
ఈ భూమికి పరిహారంగా ప్రభుత్వం నుంచి రూ.4.32 కోట్లు మంజూరయ్యాయి. సదరు వెంచర్లో రహదారుల నిర్మాణం కోసం వదిలిన స్థలాలకు మంజూరైన పరిహారాన్ని స్థానిక గ్రామపంచాయతీకి ఇవ్వా ల్సి ఉండగా.. ఈ వెంచర్ చేసిన స్థిరాస్తి వ్యాపారులు అక్రమంగా తీసుకున్నారు. దీనిపై ఫిర్యా దు అందడంతో ప్రభుత్వం విచారణ చేపట్టిం ది. స్థిరాస్తి వ్యాపారుల్లో ఒకరి వద్ద పనిచేసిన డ్రైవర్ బ్యాం కు ఖాతాలో రూ.1,15,19,000 జమ అయ్యా యి.
అందు లో నుంచి ఆర్డీవో సిడాం దత్తు తల్లి సిడాం మల్కుబాయి ఖాతాలోకి రూ.65 లక్షలు, డిప్యూటీ తహసీల్దార్ మేస్రం నాగోరా వు సోదరుడు మేస్రం చత్రుషా ఖాతా లో రూ.30 లక్షలు బదిలీ అయినట్టు విచారణలో తేలింది. సర్వేయర్ భరత్కు రూ.10 లక్షల నగదుతోపాటు రూ.2 లక్షల విలువైన బైకును స్థిరాస్తి వ్యాపారులు కొనుగోలు చేసి ఇచ్చారని వెలుగులోకి వచ్చింది. నిందితుల బ్యాంకు స్టేట్మెంట్లు, స్థిరాస్తి వ్యాపారి డ్రైవర్ వాంగ్మూలా న్ని విచారణ అధికారులు నమోదు చేశారు.