పాలకుర్తి, జూన్ 20 : జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని గూడూరులో వీరగల్లు విగ్రహాన్ని గురువారం చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి గుర్తించారు. గూడూరులోని పోచమ్మ గుడి సమీపంలో 12 లేదా 13వ శతాబ్ద కాలం నాటి వీరగల్లు విగ్రహం లభించిందని తెలిపారు. వెడల్పైన ముఖం, గుండ్రంగా వేసిన సిగ, ముడి చెవికి కుండలాలు, కంఠాభరణం, గోచి ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.
రెండు చేతుల్లో ఈటె ధరించిన ఉన్నట్టు పేర్కొన్నారు. వీరుని విగ్రహం సమీపంలో వినాయక విగ్రహం భూమిలో కూరుకుపోయి ఉన్నదని చెప్పారు. వీటితోపాటు గ్రామంలో పూజకు నోచుకోని విగ్రహాలన్నింటిని పంచాయతీ కార్యాలయంలోని శాసనం వెనుక భాగంలో అరలు నిర్మించి భద్రపరిస్తే ఈ గ్రామం మ్యూజియంగా తయారవుతుందని తెలిపారు.