హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాసానికి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెళ్లారు. హైదరాబాద్కు వచ్చిన గోయల్ను సీఎం రేవంత్ తన నివాసానికి ఆహ్వానించి సాదరస్వాగతం పలికారు.
ఇద్దరూ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై కేంద్రమంత్రితో సీఎం చర్చించారు. భేటీలో మంత్రి శ్రీధర్బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి కూడా ఉన్నారు.