హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాలు వచ్చేదాకా ఉద్యమిస్తాం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతాం.. అని నిరుద్యోగ యువత ప్రతినబూనింది. గ్రూప్1 మెయిన్స్కు 1:100 నిష్పత్తి పాటించాలని, గ్రూప్2, 3లో ఉద్యోగాల సంఖ్య పెంచాలని, మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ ఆఫీస్ ముట్టడికి మంగళవారం పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ఏబీవీపీ మదతిచ్చింది.
ఉదయం నిరుద్యోగులు టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి తరలిరాగా, అప్పటికే పోలీసులు మోహరించి గేట్ల ముందు బారికేడ్లు అడ్డు పెట్టారు. నిరుద్యోగులు అక్కడే బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని మండిపడ్డారు. ధర్నా చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు.