నెల్లికుదురు, జూన్ 30: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి శివారు పెద్దతండాకు చెందిన బానోత్ నీలమ్మ (36)తో అదే తండాకు చెందిన బానోత్ వీరన్నతో వివాహేతర సంబంధం కొనసాగుతున్నది. ఈ విషయంలో భార్యాభర్తలకు గొడవలు జరుగగా.. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. బానోత్ వీరన్న మరోసారి నీలమ్మ జోలికి రావొద్దని తీర్మానం చేశారు. కానీ.. వీరన్న తన ప్రవర్తన మార్చుకోకుండా నీలమ్మను తరచూ వేధించేవాడు.
ఈ నెల 29న వీరన్న నీలమ్మ ఇంటికి వచ్చి గొడవ చేశాడు. తండాలో అసభ్యకరంగా ప్రచారం చేశాడు. దీంతో అవమానం భరించలేక నీలమ్మ, ఆమె భర్త భద్రు ఆదివారం ఉదయం పురుగుల మందు తాగారు. స్థానికులు ఇద్దరిని స్థానిక దవాఖానకు తీసుకెళ్లగా నీలమ్మ మృతి చెందింది. భద్రు చికిత్స పొందుతున్నాడు.