హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో సీట్ల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎప్సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం మొదలైంది. తొలిరోజు 56,674 మంది విద్యార్థులు ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్నట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎప్సెట్ కన్వీనర్ దేవసేన తెలిపారు.
ఈ నెల 6 నుంచి 13 వర కు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక, 19వ తేదీలోపు సీట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు. వివరాలకు https: //tgeapcet.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.