పెంబి, జూలై 3 : పత్తి మొలకెత్తలేదని ఓ గిరిజన రైతు ఆత్మహత్య చే సుకున్నాడు. పోలీసుల కథనం ప్ర కారం.. నిర్మల్ జిల్లా పెంబి మండ లం యాపల్గూడకు చెందిన అర్క సంతోష్ (28) తనకున్న ఎకరంతోపాటు మరో నాలుగెకరాలు కౌలు కు తీసుకుని పత్తి వేశాడు. ఇటీవల కురిసిన వర్షాలకు విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో పెట్టుబడి నష్టపోయానని మనస్తాపం చెందాడు.
మంగళవారం సాయంత్రం గ్రామ శివారులోని కడెం వాగు ఒడ్డున సంతోష్ పురుగుమందు తాగా డు. కుటుంబ సభ్యులకు తెలియడంతో వెంటనే సంతోష్ను నిర్మ ల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందా డు. ఓ వైపు పెట్టుబడి భారం.. మరోవైపు పేదరికం తోడు కావడంతో బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తున్నది. ఈయనకు భార్య, కొడుకు, కూతు రు ఉన్నారు.