హైదరాబాద్ : సింగరేణి సీఎండీ బలరాంనాయక్కు(Singareni CMD Balaram nayak) ప్రతిష్టాత్మక ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ(Tree Man of Telangana Award) అవార్డు వరించింది. సింగరేణి సంస్థను పర్యావరణ హిత సంస్థగా మార్చడమేగాకుండా తానే స్వయంగా 18వేలకు పైగా మొక్కలు నాటి కోల్బెల్ట్ ఏరియాలోని ఆరు జిల్లాల్లో 35 చిన్న అడవులను సృష్టించినందుకు గుర్తింపుగా గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ఫౌండేషన్-2024 అవార్డుల ప్రదా నోత్స వంలో ఆ సంస్థ ఎండీ అశుతోష్ వర్మ, ఎన్టీపీసీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఉన్నతాధికారులు సింగరేణి సీఎండీ బలరాంకు ఈ అవార్డును అందజేశారు.
దేశంలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ప్రభుత్వ రంగ, ప్రైవేటు రంగ దిగ్గజ కంపెనీలు, అందులోని ప్రభావశీల వ్యక్తులకు గ్రీన్ మ్యాపుల్ సంస్థ ప్రతి ఏడాది ప్రోత్సాహక అవార్డులు అందజేస్తూ వస్తున్నది. ఇందు లో భాగంగా సివిల్ సర్వీసెస్ అధికారిగా ఉన్నత స్థాయిలో తీరిక లేకుండా ఉండి కూడా పర్యావరణ పరిరక్షణ కోసం వేలాది మొక్కలు నాటినందుకు గాను పురస్కారానికి ప్రదానం చేసింది.