BRS | హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గ్రూప్-2, గ్రూప్3లో పోస్టులు పెంచాలని, గ్రూప్-1 మెయిన్కు 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని, డిసెంబర్లో గ్రూప్స్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నె 20న హైదరాబాద్లోని ఇందిరాపార్కు ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న రేవంత్రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ధర్నాకు పిలుపునిచ్చినట్టు నిరుద్యోగులు వెల్లడించారు.
బీఆర్ఎస్ మద్దతు: ఆర్ఎస్పీ
నిరుద్యోగ సమస్యల పరిషారానికి గురువారం నిరుద్యోగ సంఘాల జేఏసీ, అశోక్ చేయబోతున్న మహాధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు. బుధవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ‘తెలంగాణలో గ్రూప్-2, 3 పోస్టులను పెంచాలి. జీవో 46 బాధిత అభ్యర్థులకు సత్వరమే న్యాయం చేయాలి. డీఎస్సీ అభ్యర్థులు ప్రిపేర్ కావడం కోసం మరికొంత సమయం ఇవ్వాలి. టెట్ సోర్లను నార్మలైజ్ చేశాకే డీఎస్సీ నిర్వహించాలి. ఏఈఈల నియామకం జరపాలి. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతిని అమలు చేయాలి. గురుకుల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.’ అని డిమాండ్ చేశారు.
పోలీసులకు మానవత్వం నేర్పించండి
కాళేశ్వరంలో మహిళా కానిస్టేబుల్పై లైంగికదాడికి పాల్పడిన ఎస్సై ఉదంతంపై ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ‘ట్రైనింగ్లో కవాతు, దేహధారుడ్యం, చట్టాలను యాంత్రికంగా అమలుపరచడమే నేర్పిస్తే సరిపోదని, మా నవత్వం, సాటి వ్యక్తులను గౌరవించమూ నేర్పండి’ అంటూ డీజీపీకి విజ్ఞప్తి చేశారు.