హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల ఆదాయపు పన్ను పరిమితిని పెంచాలని, సీపీఎస్ను రద్దుచేయాలని టీఎన్జీవో, టీజీవో నేత లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న టీఎన్జీవో, టీజీవో నేతలు శుక్రవారం మంత్రి చాంబర్లో కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.
గెజిటెడ్ అధికారులు, ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికుల ఆదాయపు పన్ను పరిమితిని రూ. రెండున్నర లక్షల నుంచి రూ. పది లక్షలకు పెంచాలని, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరారు. టీఎన్జీవో అధ్యక్షుడు జగదీశ్వర్, టీజీవో అ ధ్యక్షుడు శ్రీనివాసరావు, టీఎన్జీవో రా ష్ట్ర అసొసియేట్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సత్యనారాయణగౌడ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, టీజీవో నాయకులు రామారావు, నరహరి పాల్గొన్నారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న టీజీవో, టీఎన్జీవో నేతలు అక్కడే ఉన్న సీఎం రేవంత్రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించారు. కానీ రేవంత్ అపాయింట్మెంట్ దొరకలేదని తెలిసింది.