తిర్యాణి, సెప్టెంబర్ 11: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణికి చెందిన కాసం శివప్రసాద్ సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఫలితాల్లో సత్తాచాటాడు. ఈ నెల 4న జేఏ పరీక్ష జరుగ గా,10న ఫలితాలు వెల్లడయ్యాయి.
100 మార్కులకు 81.880 సాధించి రాష్ట్ర టాపర్గా నిలిచాడు. శివప్రసాద్ మొదటి ర్యాంకు సాధించడంపై కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.