హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది జనవరి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదుల కోటా టికెట్ల కోసం ఆన్లైన్ నమోదు ప్రక్రియను టీటీడీ బుధవారం నుంచి ప్రారంభించింది. సేవల ఆన్లైన్ లక్కీడిప్ నమో దు ప్రక్రియ బుధవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కాగా, 20న వరకు అవకాశం ఉన్నట్టు టీటీడీ తెలిపింది.
టికెట్లు పొందిన భక్తులు 22న మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుం చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాలని పేర్కొన్నది. కల్యాణోత్స వం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకారణ సేవా టికెట్లను 21న ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవా టోకెన్లను మ ధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తా రు. ఈ నెల 23న ఆంగప్రదక్షిణం, శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటా, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్ల కోటాను విడుదల చేస్తారు. వసతి గదుల బుకింగ్ కోసం ఈ నెల 25న టికెట్లు విడుదల చేస్తారు.