Gandhi Hospital | హైదరాబాద్ : గాంధీ హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతారవణం నెలకొంది. స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. గాంధీ ఆస్పత్రిలోకి వెళ్లే ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే హాస్పిటల్లోకి పంపిస్తున్నారు పోలీసులు. మీడియాను మాత్రం హాస్పిటల్లోకి అనుమతించడం లేదు.
నిరుద్యోగుల సమస్యలపై నిరుద్యోగ జేఏసీ ఉద్యమ నాయకుడు మోతీలాల్ నాయక్ గాంధీ ఆస్పత్రిలో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోతీలాల్ నాయక్ను పరామర్శించేందుకు ఆయా పార్టీల నేతలు, ఉద్యమకారులు గాంధీ హాస్పిటల్కు తరలివస్తున్నారు. కానీ వీరిని పోలీసులు అనుమతించడం లేదు. ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్న వారిని వెంటనే అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గాంధీ హాస్పిటల్ వద్ద నెలకొన్న పరిస్థితులను కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియాపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. హాస్పిటల్ గేటు బయటే మీడియాను నిలిపివేశారు. లోపలికి అనుమతి లేదంటూ పోలీసులు చెబుతున్నారు. దీంతో మీడియా బయటనే ఉండిపోయింది.
గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలి.
గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలి.
జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి.
గాంధీ హాస్పిటల్ వద్ద హై టెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు
గాంధీ హాస్పిటల్లోకి మీడియాకు కూడా నో ఎంట్రీ pic.twitter.com/RGIJlwybSV
— Telugu Scribe (@TeluguScribe) July 1, 2024