BTPS | మణుగూరు టౌన్, జూన్ 30: భద్రాద్రి జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (బీటీపీఎస్)లో యూనిట్-1 వద్ద శనివారం రాత్రి పిడుగు పడటం వల్లే జరిగిన అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు ధ్రువీకరించారు.
విద్యు త్తు థర్మల్ డైరెక్టర్ లక్ష్మయ్య, విద్యుత్తు సౌధా ఎస్ఈ రత్నాకర్ ఆదివారం బీటీపీఎస్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం డైరెక్టర్ లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ.. దీనివల్ల దాదాపు రూ.25 కోట్ల మేర నష్టం జరిగి ఉంటుందని, 270 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్టు తెలిపారు.