Vanamahotsavam | హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది హరిత వన మహోత్స వం అమలులో గందరగోళం నెలకొన్నది. శనివారం వరంగల్, హనుమకొండలో అధికారికంగా సీఎం రేవంత్రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాల్లో ఎప్ప టి నుంచి చేపట్టాలనే విషయంలో స్పష్టమైన షెడ్యూల్ లేకపోవడంతో అధికారు ల్లో ఆయోమయం నెలకొన్నది. గతంలో హరితహారం కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించిన రోజే రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటేవారు. కానీ ఈ ఏడాది ప్రా రంభించిన వనమహోత్సవంలో అలాంటి పరిస్థితిలేదు. మంత్రులు పలు అధికారిక కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ వన మహోత్సవాన్ని చేపట్టలేదు. జిల్లాల్లో కార్యక్రమాన్ని మొదలుపెట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గరం గరం జూన్ నెల
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): జూన్లొ దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ అత్యంత వేడి నెలగా జూన్ రికార్డులకెక్కింది. 1901 తర్వాత జూన్లో 31.73 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతతో అధిక ఉష్ణోగ్రత నమోదైంది. వాయవ్య భారతోలో జూన్ సగటు ఉష్ణోగ్రత సాధారణం కంటే 1.65 డిగ్రీలు అధికమని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మహాపాత్రా తెలిపారు. జూన్లో తెలంగాణలో స్వల్పంగా 26 మి.మీ అధిక వర్షపాతం నమోదవ్వగా.. దేశంలో 11 శాతం లోటువర్షపాతం నమోదైంది. ఐదేండ్లలో ఇదే అధికమని భారత వాతావరణశాఖ సోమవారం తెలిపింది. ఐఎండీ లెక్కల ప్రకారం.. జూన్లో సాధారణ వర్షపాతం 165.3 మి.మీ ఉండగా..దేశవ్యాప్తంగా 147.2 మి.మీ వర్షపాతం నమోదైంది.
కొనసాగుతున్న అల్పపీడనం
అల్పపీడనం ప్రభావంతో మరో 3 రోజులు ఈదురుగాలులు, మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం వికారాబాద్ జిల్లా తాండూరులో 5.48 సెం.మీ అధికవర్షపాతం నమో దైంది. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, పెద్దపల్లి, జగిత్యాల, మహబూబాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసింది.