హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : ఫోన్ ట్యాపింగ్కు ఆదేశించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఇది పూర్తిగా రాష్ట్రాల పరిధిలోని అంశమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఫోన ్లట్యాపింగ్ జరిగిందని, హైకోర్టు న్యాయమూర్తి ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందంటూ పత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటో పిటిషన్గా పరిగణించింది.
దీనిపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఆ కాపీ ప్రతి కోర్టు ఫైల్లో లేకపోవడంతో విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.