Adani | హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని విద్యుత్తు పంపిణీ వ్యవస్థలను క్రమంగా ప్రైవేట్కు ధారాదత్తం చేసేందుకు రేవంత్రెడ్డి సర్కారు సిద్ధపడుతున్నది. ఏకంగా ప్రైవేటీకరణకు గేట్లు తెరిచి అదానీ కంపెనీ చేతుల్లో ‘తెలంగాణ పవర్’ను పెట్టబోతున్నట్టు తెలుస్తున్నది. ప్రజల పన్నులు, సొమ్ములతో ఏర్పాటైన కరెంటు సరఫరా వ్యవస్థలను బేరానికి పెట్టి, ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్తు పంపిణీ బాధ్యతలను అదానీ గ్రూప్నకు అప్పగించబోతున్నది. సాక్షాత్తు ఇదే విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి గురువారం ఢిల్లీలో జరిగిన మీడియా చిట్చాట్లో వెల్లడించారు. పాతబస్తీలో కరెంట్ బిల్లుల వసూలుపై అదానీ గ్రూప్తో చర్చించగా వారు సమ్మతించినట్టు తెలిపారు. సీఎం వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగడం, విమర్శలు రావడంతో రేవంత్రెడ్డి శుక్రవారం మళ్లీ అదే విషయాన్ని చెప్పారు.
పాతబస్తీలో విద్యుత్తు బిల్లుల వసూలు బాధ్యతను అ దానీ కంపెనీకి అప్పగించామని స్పష్టంచేశారు. పాతబస్తీలో అండర్గ్రౌండ్ విద్యుత్తు లైన్లు వేసి మొత్తం వ్యవస్థను మార్చాలని అదానీ కంపెనీని కోరామంటూ సమర్థించుకునే ప్రయత్నంచేశారు. ఇది విద్యుత్తు ప్రైవేటీకరణకు ఆరంభం మాత్రమేనని, క్రమంగా హైదరాబాద్ నగరం, ఆ తర్వాత రాష్ట్రం మొత్తంగా విద్యుత్తు పంపిణీ వ్యవస్థను అదానీ గ్రూపునకు కట్టబెట్టాలన్నది రేవంత్ సర్కారు కుట్ర అని విద్యుత్తురంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదే జరిగితే విద్యుత్తు పంపిణీ సంస్థలకు ఉరితాళ్లు బిగియడం ఖాయమని, కరెంట్ కావాలన్నా, కనెక్షన్ కావాలన్నా అదానీ ముందు తెలంగాణ ప్రజలు, వినియోగదారులు మోకరిల్లాల్సిన పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. పాతబస్తీతో మొదలుపెట్టి రాష్ట్రమంతా విడతల వారీగా ట్రాన్స్కో, జెన్కోలను అదానీ చేతిలో పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నదని చెబుతున్నారు.
కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో గృహజ్యోతి పథకాన్ని అమలుచేస్తున్నామని చెబుతున్నది. ఈ పథకం కింద 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందిస్తున్నట్టు పేర్కొంటున్నది. పాతబస్తీలో ఎక్కువగా గృహ వినియోగదారులే ఉన్నారు. వీరిలో అధికమొత్తం పేదలే. 200 యూనిట్లు ఉచితం అయినప్పుడు నష్టా లు ఎలా అనే ప్రశ్న తలెత్తుతున్నది. ఇక్కడ బి ల్లుల పెండింగ్లో ఉన్నాయని, వసూలుకు వె ళ్లిన సిబ్బందిపై స్థానికులు దాడులు చేస్తున్నారని ప్రభుత్వం చెబుతున్నది. ఇలా పాతబస్తీని సాకుగా చూపి తెలంగాణ విద్యుత్తు వ్యవస్థను మొత్తం అదానీకి తాకట్టుపెట్టే కుట్రకు రేవంత్ సర్కారు తెరతీసిందన్న విమర్శలు వస్తున్నా యి. గుజరాత్, ముంబై తదితర ప్రాంతాల్లో అదానీ, టాటా పవర్ కంపెనీలు కొన్ని ప్రాం తాలను కైవసం చేసుకున్నాయి.
బహిరంగ టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో ఎంఓయూ ద్వారా ఛత్తీస్గఢ్ ప్రభు త్వం నుంచి గత కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్తు కొనుగోలు చేస్తే తప్పు అని ఏకంగా దీనిపై విద్యుత్తు విచారణ సంఘాన్ని వేసి ప్రభుత్వం విచారణ జరుపుతున్నది. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లను ప్రభుత్వ రంగంలోని బీహెచ్ఈఎల్కు అప్పగించినందుకు గగ్గోలు పెడుతున్నది. మరి టెండర్లు లేకుండా సీఎం రేవంత్రెడ్డి, అదానీ గ్రూపునకు రాజధానిలోని ఓ కీల క ప్రాంతాన్ని, అదీ ఓ ప్రైవేట్ కంపెనీకి ఎలా అప్పగిస్తారన్న ప్రశ్న తలెత్తుతున్నది. కేసీఆర్ హయాంలో ఒక ప్రభుత్వంతో మరో ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలతో ఒప్పం దం చేసుకుంటే తప్పు, ఇప్పుడు ప్రభుత్వం ఓ ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటే ఒప్పు ఎలా అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో ఏకంగా ప్రకటన చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దావోస్లో అదానీతో రేవంత్కు కుదిరిన బంధం మరింత పటిష్టమైందని, ఇక క్రమంగా అన్ని రంగాల్లో అదానీకి రేవంత్ రెడ్ కార్పేట్ పరుస్తారన్న వాదనలున్నాయి.