హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్కు 2023-24 ఏడాదికి శుక్రవారం జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడ్డాయి. అధ్యక్షుడిగా పల్లె నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షుడిగా చెంగల్వ కల్యాణ్రావు గెలుపొందారు. కార్యదర్శులుగా ప్రదీప్రెడ్డి, పులి దేవేందర్, స్పోర్ట్స్ విభాగం కార్యదర్శిగా కటకం శారద, కోశాధికారిగా వెంగల పూర్ణశ్రీ, జాయింట్ సెక్రటరీగా శ్రీనివాస్ బైరెడ్డి ఓట్లతో గెలిచారు. కార్యనిర్వాహక సభ్యులుగా కే శ్రీనివాస్రావు, సీ సునీతకుమారి ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా కొత్త ఉపాధ్యక్షుడు చెంగల్వ కల్యాణ్రావు మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఇతర ప్రభుత్వ పెద్ద సహకారంతో న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తన గెలుపునకు కృషి చేసిన వారికి ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు.