అచ్చంపేట టౌన్, జూలై 16 : నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని (Achampet)ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిని అనుసరించి ఉన్న దుకాణాల వద్ద ఓ చెట్టును నరికివేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో(Harithaharam tree) ఈ మొక్కను నాటగా పెరిగి పెద్దయింది. అయితే సమీపంలోని దుకాణంలో పనిచేస్తున్న పర్వతాలు అనే వ్యక్తి మంగళవా రం ఒక చెట్టును కొట్టేశాడు. ఈ విషయం మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ దృష్టికి తీసుకెళ్లారు.
అతడి ఆదేశాల మేరకు పర్వతాలుకు రూ.4 వేల జరిమానా విధించినట్లు సిబ్బంది(Municipal authorities) తెలిపారు. అలాగే కొట్టేసిన చెట్టు స్థానంలో మరో మొక్క నాటాలని సూచించారు. ఎవరైనా చెట్లను కొట్టేస్తే తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మొక్కల పెంపకంతోనే మానవ మనుడగ ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.