హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): స్మార్ట్సిటీ పనులను పూర్తి చేయడానికి 2024 జూన్ వరకు గడువు పెంచినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు రంజిత్రెడ్డి, వెంకటేశ నేత స్మార్ట్సిటీ పనులు, నిధుల వినియోగంపై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి కౌశల్కిషోర్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. వరంగల్, కరీంనగర్ స్మార్ట్సిటీల పనులకు రూ.919 కోట్లు విడుదల కాగా, రూ.852 కోట్లు వినియోగించినట్టు తెలిపారు.
జలవిద్యుత్తు సామర్థ్యం 800 మెగావాట్లు
తెలంగాణలో 800 మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుత్తు ప్రాజెక్టులు ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఎంపీలు రంజిత్రెడ్డి, వెంకటేశ్ నేత అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఆర్కేసింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. జూరాలలో 234 మెగావాట్లు, పోచంపాడులో 36, నాగార్జునసాగర్లో 110, నాగార్జునసాగర్ ఎడమ కాలువపై 60, లోయర్ జూరాల వద్ద 240, పులిచింతల ప్రాజెక్టుపై 120 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్తు ప్రాజెక్టులు ఉన్నాయని వివరించారు.