హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాల గడువును జూలై 31 వరకు ఇంటర్మీడియట్ విద్యామండలి పొడగించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, టీజీ రెసిడెన్షియల్, టీజీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియ ల్, టీజీ గిరిజన, టీజీ సంక్షేమ, టీజీబీ సీ, టీజీ మైనార్టీ, టీజీ మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు శనివారం ఆ దేశాలు జారీచేసింది. ప్రభుత్వ గుర్తిం పు, అనుమతి పొందిన కళాశాలల్లోనే చేరాలని విద్యార్థులకు సూచించింది. క ళాశాలల వివరాలకు acadtsbie.cg g.gov.in, tgbie.cgg.gov.inను చూడాలని కోరింది.
‘న్యాయనిపుణుల’కు దరఖాస్తులు
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): టీజీపీఎస్సీలో లీగల్ ఎక్స్పర్ట్స్ -3, సీనియర్ కౌన్సెల్ -1 పోస్టు ల భర్తీ కోసం శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎల్ఎల్బీ/ ఎల్ఎల్ ఎం పూర్తి చేసి, సర్వీస్ అంశాల్లో మూ డేండ్ల అనుభవం ఉన్నవారికి నెలకు రూ.60వేల జీతంతో కాంట్రాక్టు లేదా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకా లు చేపడుతారు. దరఖాస్తులు చేసుకోవడానికి జూలై 15 చివరి రోజు. వివరాలకు వెబ్సైట్ను సంప్రదించాలని టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు.
అధ్యయనాలకు జీబ్రా ఫిష్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): అధ్యయనాలకు జీబ్రా ఫిష్ (చారల చేపలు) ఎంతో అనుకూలంగా ఉంటాయని సీ సీఎంబీ పరిశోధకులు చెప్తున్నారు. వేలి పొడువు ఆకారంతో, చర్మంపై పొడవైన చారలతో చూడటానికి వింతగా ఉండే ఈ చేపల జన్యు క్రమం సీక్వెన్సింగ్ చే యబడి ఉండటంతోనే ఎలాంటి పరిశోధనలకైనా మెరుగైన ఫలితాలను పొం దే వీలు ఉంటుందని వివరిస్తున్నారు.
గంగా, బ్రహ్మపుత్ర పరివాహాకాల్లో ఉండే నీటి వనరుల్లో ఎక్కువగా సంచరించే ఈ బీబ్రా ఫిష్ సంతతి క్రమంగా విస్తరించిందని తెలిపారు. ప్రస్తుతం 31 దేశాలకు చెందిన 10 వేలకు మందికిపైగా పరిశోధకుల అధ్యయనాలకు జీబ్రా ఫిష్ ప్రధాన ఆధారమని వెల్లడించారు. డయాబెటిస్, అరుదైన జన్యు సంబంధిత వ్యాధులు, న్యూరో డిజార్డర్, అల్జీమర్, పార్కిన్సన్ వంటి పరిశోధనల్లోనూ వీటిని ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.