హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): టీజీఎస్ఆర్టీసీ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను నడుపాలని నిర్ణయించింది. ఇటీవలే హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయోగాత్మకంగా గరుడ ప్లస్ క్యాటగిరీతో 10 ఎలక్ట్రిక్ బస్సులను నడిపిన ఆర్టీసీ, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ప్రారంభించాలని నిర్ణయించింది.
పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ క్యాటగిరీల్లో ఎలక్ట్రిక్ బస్సులు నడవనున్నాయి. కొత్తగా 450 బస్సులు వారం తర్వాత దశల వారీగా రోడ్డెక్కనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట మధ్య కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నడుపనున్నట్లు తెలుస్తున్నది. నేషనల్ ఎలక్ట్రిక్ బస్ కార్యక్రమం కింద ఇవి మంజూరయ్యాయి.