Tenth Results | హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదలయ్యాయి. సప్లిమెంటరీ ఫలితాల్లో 73.03 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షలకు 51,272 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 46,731 మంది హాజరయ్యారు. వీరిలో 34,126 మంది ఉత్తీర్ణత సాధించారు.
బాలురు 71.01 శాతం ఉత్తీర్ణత నమోదు చేయగా, బాలికలు 76.37 శాతం ఉత్తీర్ణత సాధించి తమ సత్తా చాటారు. బాలుర కంటే బాలికలు 5.36 శాతం అధికంగా ఉత్తీర్ణత నమోదు చేశారు. నిర్మల్ జిల్లా 100 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. వికారాబాద్ జిల్లా 42.14 శాతం ఉత్తీర్ణత నమోదు చేసి చివరి స్థానంలో నిలిచింది. ఫలితాల కోసం ఈ వెబ్సైట్ను https://bse.telangana.gov.in/aseresults/ క్లిక్ చేయొచ్చు.
రీకౌంటింగ్ చేయించాలనుకునే విద్యార్థులు ఒక్కో సబ్జెక్ట్కు రూ. 500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. రీకౌంటింగ్ కోసం జులై 8వ తేదీ లోపు ఎస్బీఐ బ్యాంక్ ద్వారా చలాన్ చెల్లించాలి. ఆ చలాన్తో పాటు దరఖాస్తును ఎస్సెస్సీ బోర్డులో సమర్పించాలి. డిమాండ్ డ్రాఫ్ట్లు అంగీకరించబడవు అని అధికారులు స్పష్టం చేశారు.