హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై నిర్లక్ష్యం చేస్తున్నదని తెలంగాణ సర్పంచ్ల జేఏసీ (Sarpanch JAC) అధ్యక్షుడు సర్వీ యాదయ్యగౌడ్ విమర్శించారు. బీఆర్ఎస్ సర్పంచ్లు ఎక్కువగా ఉన్నారని కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తే ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సర్పంచుల పదవీకాలం ఆరు నెలల దాటినా గ్రామ పంచాయతీలకు చిల్లిగవ్వ ఇవ్వకపోవడం దారుణమన్నారు. పంచాయతీ వర్కర్లు జీతాలు అందక వారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని చెప్పారు.
పెండింగ్ బిల్లులను చెల్లించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తున్న నేపథ్యంతో తెలంగాణ తెలంగాణ గవర్నర్ను కలవనున్న సర్పంచ్ల సంఘం నేతలు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గ్రామాలకు నిధులు మంజూరు చేయడం లేదని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. 6 నెలల నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లుల చెల్లింపు.. కేంద్రం నుండి రావాల్సిన బిల్లుపై జాప్యం చేస్తున్నదని వెల్లడించారు.