Smart Cities | హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): స్మార్ట్సిటీ మిషన్ను 2025 మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ముందుగా కేంద్రం నిర్ణయించిన గడువు ప్రకారం స్మార్ట్సిటీ మిషన్ కాల పరిమితి ఆదివారంతో ముగిసింది.
రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్ నగరాల్లో స్మార్ట్ మిషన్ పనులు చేపట్టగా, వరంగల్లో 45 పనులు పూర్తయ్యాయి. రూ.518 కోట్ల వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు కొనసాగుతున్నాయి. కరీంనగర్లో 25 పనులు పూర్తయ్యాయి. రూ.287 కోట్లతో చేపట్టిన మరో 22 పనులు కొనసాగుతున్నాయి. స్మార్ట్సిటీలో చేపట్టిన పనులు పూర్తికానందున ప్రజా ప్రయోజనార్థం ఇవి పూర్తయ్యేంత వరకు మిషన్ గడువును పొడిగించడానికి కేంద్రం నిర్ణయించింది.
ఇప్పటికే నిధులు కేటాయించి ఆమోదించిన పనులను కొనసాగించాలని, కొత్త పనులు మంజూరు చేయొద్దని కేంద్రం స్పష్టం చేసింది. జరుగుతున్న పనులకు సంబంధించిన నిధులను ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఫస్ట్ కమ్ ఫస్ట్ పద్ధతిన విడుదల చేయనున్నది.