హైదరాబాద్, జులై 1(నమస్తే తెలంగాణ): సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వానకాలంలో కొనుగోలు కేంద్రాలకు ఎక్కువగా సన్నధాన్యం వచ్చే అవకాశం ఉన్నది. ఈ తరుణంలో ప్రభుత్వానికి బియ్యం ఇచ్చే ప్రక్రియ కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎమ్మార్) నిబంధనల్లో మార్పులు చేయాలని రైస్ మిల్లర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సీఎమ్మాఆర్ ఔట్ట్న్ రేషియో (ధాన్యం నుంచి బియ్యం వచ్చేది), నూకశాతం నిబంధనను తగ్గించాలని కోరుతున్నారు. ఎఫ్సీఐ నిబంధనల ప్రకారం సీఎమ్మార్ రారైస్కు మిల్లర్లు 67 శాతం బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. సన్న ధాన్యంను మిల్లింగ్ చేస్తే 67శాతం వచ్చే అవకాశం ఉండదని మిల్లర్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో 67శాతాన్ని తగ్గించాలని కోరుతున్నారు. రా రైస్లో ఎఫ్సీఐ నిబంధనల ప్రకారం 25 శాతం నూకలను అనుమతిస్తారు. సన్నబియ్యంలో 25శాతం నూకలుంటే ఆ బియ్యం మొత్తం నూకలుగా కనిపించే అవకాశం ఉన్నందున ఈ నిబంధనను సడలించాలని కోరుతున్నారు.
మంగళవారం పౌరసరఫరాల సంస్థ కమిషనర్ డీఎస్చౌహాన్ రాష్ట్ర మిల్లర్లతో కీలక సమావేశాన్ని నిర్వహించి, ధాన్యం కొనుగోళ్లు, సన్న ధాన్యం సేకరణ, బోనస్, సీఎమ్మార్పై చర్చించే అవకాశం ఉంది. బుధవారం సివిల్సైప్లెపై సీఎం సమీక్ష, డీఎస్వోలు, సీఎస్వోలు, అధికారులతో ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఈ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారులు నివేదికల తయారీలో నిమగ్నయ్యారు.