Rythu Bharosa | రైతు భరోసా పై నిర్ణయం తీసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సారధ్యంలో రైతు భరోసా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. గత నెల 22న జరిగిన క్యాబినెట్ సమావేశంలోనే రైతు భరోసా పథకంపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తదనుగుణంగా భట్టి సారధ్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది.
రైతు భరోసా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా మల్లు భట్టి విక్రమార్క, కమిటీలో సభ్యులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. రైతు భరోసా పథకం అమలు చేయడానికి విధి విధానాలపై చర్చించి రాష్ట్ర మంత్రి మండలికి భట్టి విక్రమార్క సారధ్యంలోని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులు చేస్తుంది.
Electricity Bills | ఇక ఆ సిస్టమ్తోనే ఎలక్ట్రిసిటీ బిల్లులు పేమెంట్స్.. ఎందుకంటే..?
Most Affordable Cars | రూ.5 లక్షల్లోపు ధర గల కార్లు కావాలా.. మూడే ఆప్షన్లు.. అవేంటంటే..?!
Coca-Cola | భారత్ మార్కెట్కు కోకా కోలా గుడ్బై.. ఈ నిర్ణయం వెనుక కారణాలేంటి..?!