హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : ఉభయ తెలుగు రాష్ర్టాలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతూ విభజన హామీల అమలుకు పోరాడాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు.
అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ఏపీలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో తెలుగు రాష్ర్టాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున పవన్ కల్యాణ్కు కొండగట్టులో స్వాగతం పలికామని చెప్పారు. గతంలో తిరుమలలో తెలంగాణ భక్తులు ఇబ్బందులు పడ్డారని, ఇకపై అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని టీటీడీని కోరారు.