CM Revant Reddy | పోలింగ్ నాడు రిజర్వులో ఉండే 15 శాతం ఈవీఎంలను టాంపరింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ సీఎం ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంలను అటూ ఇటూ మారిస్తే తెలిసే అవకాశమే ఉండదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఐదేండ్లకోసారి అధికార మార్పిడి జరిగే ధోరణి నెలకొందన్నారు. 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారని జోస్యం చెప్పారు. తెలంగాణలో పదేండ్లకోసారి అధికార మార్పిడి జరిగే అవకాశం ఉందన్నారు. 2029 వరకూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్నారు.
ఇటీవల బీఆర్ఎస్కు రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నేత, ఎంపీ కే కేశవరావు ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండేండ్ల పదవీ కాలం ఉండగానే గురువారం తన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కేశవరావును సీఎం రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
Motorola Razr 50 Ultra | ప్రీమియం సెగ్మెంట్లో మరో ఫోన్ మోటరోలా రేజర్ 50 ఆల్ట్రా ఆవిష్కరణ..!
Gold – Silver Rates | బంగారం.. వెండి ధరలు ధగధగ.. కారణమిదేనా..?!
EPFO Alert | ఈపీఎఫ్ స్కీంలో సవరణలు.. 23 లక్షల మందికి బెనిఫిట్..?!
Amazon Prime Day Sale 2024 | అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ వచ్చేసింది.. 55 శాతం వరకూ డిస్కౌంట్లు.. !