న్యూశాయంపేట, జూన్ 29 : విద్య, వైద్యం, విద్యుత్తు అందుబాటులో ఉంటే విశ్వనగరంగా అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఇప్పటికే హైదరాబాద్ ఆ మేరకు అభివృద్ధి చెందిందని తెలిపారు. హనుమకొండ హంటర్రోడ్లో మెడికవర్ హాస్పిటల్ను శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంత్రులు దామోదర రాజనర్సింహ, సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యరంగాన్ని విస్తరించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఇకడ మెడికవర్ హాస్పిటల్ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉన్నదని అన్నారు. ఫార్మా విషయమై ఎప్పుడు చర్చకు వచ్చినా అందులో హైదరాబాద్కు స్థానం ఉంటుందని తెలిపారు. తెలంగాణను మెడికల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రం లో ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని పేర్కొన్నారు.
మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీ అనిల్ కృష్ణ మాట్లాడుతూ దేశంలో అగ్రగామి మల్టీనేషనల్ హాస్పిటల్ చైన్గా ప్రస్తుతం 24 దవాఖానలను నిర్వహిస్తూ, ఏటా లక్షలాది మందికి వైద్య సేవలను అందిస్తున్నట్టు తెలిపారు. అత్యంత నిష్ణాతులైన 40 మందికి పైగా డాక్టర్లతోపాటు ప్రపంచస్థాయి క్యాత్ ల్యాబ్ ఇకడ అందుబాటులో ఉంటుందని చెప్పారు. మెడికవర్ హాస్పిటల్స్ ఇండి యా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డాక్టర్ ఏ శరత్రెడ్డి, పీ హరికృష్ణ మాట్లాడుతూ వరంగల్లో 300 పడకలతో ఏర్పాటు చేసిన ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏడు ఆపరేషన్ థియేటర్స్తోపాటు పెద్ద సంఖ్యలో ఐసీయూ బెడ్స్ ఉన్నాయని తెలిపారు.