యాదాద్రి భువనగిరి, జూన్ 17 (నమస్తేతెలంగాణ) : భువనగిరిలో స్వర్ణగిరీశుడిని 46 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త మానేపల్లి రామారావు తెలిపారు. ఆలయ ప్రతిష్ఠచేసి వంద రోజులు పూర్తయిన సందర్భంగా సోమవారం ఆయన ఆలయం లో మీడియాతో మాట్లాడారు.
ఇప్పటివరకు వివిధ ట్రస్ట్ల ద్వారా రూ. 12.49 కోట్ల ఆదాయం సమకూరిందని వెల్లడించారు. ఆలయానికి వచ్చే ప్రతి పైసా భక్తుల కోసమే ఖర్చు చేస్తామని తెలిపారు. దేశంలోనే ఆధునిక ఆర్కిటెక్చర్లో అయోధ్య రామమందిరం తర్వాత స్వర్ణగిరి రెండో స్థానంలో నిలిచిందని అన్నారు.16 ఆర్జిత సేవలను www.ytdtemple. com వెబ్సైట్లో బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు. రోజుకు 8 వేల మంది అన్నప్రసాదం స్వీకరిస్తున్నారని తెలిపారు.