జనగామ, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు భూసమస్యను పరిష్కరిస్తలేరని సోమవారం ఓ మహిళ జనగామ కలెక్టరేట్లో ఆత్మహత్యాయత్నం చేసింది. నర్మెటలోని సర్వే నంబర్ 201/B/1, 2లో ఎకరం 4 గుంటల భూమిని జంగిటి ఆంజనేయులు కబ్జా చేశాడని దేవరపల్లి జ్యోతి గతంలో ఫిర్యాదు చేసింది. ఎవ రూ పట్టించుకోకపోవడంతో సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణికి తన ఇద్దరు పిల్లలతో వచ్చి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిం ది.
గమనించిన పోలీసులు ఆమెను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై ఆంజనేయులు వివరణ కోరగా జ్యోతి పెండ్లి కోసం ఆమె తండ్రి శ్రీధర్ భూమిని అమ్మాడని, రిజిస్ట్రేషన్ కోసం రూ. లక్ష తీసుకున్నాడని తెలిపారు. డబ్బుల కోసం జ్యోతి తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.