హైదరాబాద్, జులై 2 (నమస్తే తెలంగాణ): రైతు భరోసా(రైతుబంధు)లో మార్పులు, నూతన విధివిధానాల రూపకల్పనపై ప్రభుత్వం మంత్రులతో సబ్కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్గా వ్యవహరించనున్నారు. మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు సభ్యులుగా ఉన్నారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి కన్వీనర్గా వ్యవహరిస్తారు.
సీవీ ఆనంద్ పేరుతో ఫేస్బుక్ ఫేక్ అకౌంట్!
డబ్బులు అడిగితే స్పందించకండి: సీవీ ఆనంద్
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తన పేరుతో ఫేస్బుక్ నకిలీ అకౌంట్ క్రియేట్ అయినట్టు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఎక్స్ వేదికగా తెలిపారు. కొన్ని ఫేక్ వాట్సాప్ డీపీలు పెట్టి, డబ్బు అడుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు తెలివిగా తనకు పరిచయం ఉన్న వ్యక్తి మీతో మాట్లాడుతారు, వారు అడిగిందల్లా ఇచ్చేయండి అంటూ వాట్సాప్ మెసేజ్ పెడుతున్నట్టు తెలిపారు. ఇట్లాంటి ఫేక్ మెసేజ్లకు పోలీసు సిబ్బంది, ఏసీబీ ఉద్యోగులు, పౌరులు ఎవరూ స్పందించవద్దని సూచించారు.
మెయిన్స్కు 24 మంది ఎస్సీ స్టడీసర్కిల్ విద్యార్థులు
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్ పరీక్షల్లో 24 మంది మెయిన్స్కు క్వాలిఫై అయినట్టు ఎస్సీ స్టడీ సర్కిల్ అధికారులు తెలిపారు. నలుగురు ఐఎఫ్ఎస్ మెయిన్స్కు అర్హత సాధించినట్టు వెల్లడించారు. 10 మంది ఎస్సీ, ఆరుగురు ఎస్టీలు, 8 మంది బీసీలు, నలుగురు మహిళలున్నట్టు తెలిపారు.